రేవంత్‌ రెడ్డి రాజకీయ సన్యాసం ఏమైంది?

18 Jan, 2020 20:42 IST|Sakshi

మంత్రి ఎర్రబెల్లి ధ్వజం 

సాక్షి, నర్సంపేట: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డిపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. రేవంత్‌ ఒక బ్రోకర్‌ అని, టీఆర్‌ఎస్‌పై ఆయన చేస్తున్న విమర్శలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని  అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో శనివారం మంత్రి ఎర్రబెల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని ప్రకటించి మాట తప్పిన రేవంత్‌రెడ్డిని ప్రజలు పట్టించుకోరన్నారు. దమ్ముంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు