మా పాలనలో రైతే రాజు: విజయసాయి

3 Jul, 2020 10:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్​ పార్టీ(వైఎస్సార్​సీపీ) పాలనలో రైతు పార్టీ పేరులోనే కాదు.. ప్రభుత్వ ప్రయారిటీలోనూ ముందుంటాడని వైఎస్సార్​ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. (కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ప్రత్యేక చర్యలు)

రాష్ట్రంలో రైతులు పండించే పంటలను కొనుగోలు చేసి జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్​ ద్వారా వినియోగదారులకు చేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి సర్కారు ప్రణాళికలు రెడీ చేసిందని పేర్కొన్నారు. ఇకపై రైతులు దళారీల మోసాలకు గురికారని విజయసాయి చెప్పారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతే రాజని పేర్కొన్నారు. (ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండ)

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా..
కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, పది రెట్లు పెరిగిన ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు. కొత్తగా 108 అంబులెన్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ కేర్ రంగం దూసుకుపోతోందని విజయసాయి మరో ట్వీట్​లో పేర్కొన్నారు. సీఎం జగన్​ కరోనా ట్రీట్​మెంట్​ను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చారని తెలిపారు. విద్య, ఆరోగ్యానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు