మొదటిసారిగా ఓటు వేసిన గద్దర్‌ 

8 Dec, 2018 02:28 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రజాస్వామంలో ఓటు హక్కు అం దరూ వినియోగించుకోవాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. మొదటిసారిగా అల్వాల్‌ సర్కిల్‌ లోని వెంకటాపురం డివిజన్‌లో భార్య విమలతో కలసి ఓటు వేశారు. ఓటుతోనే పాలకుల ఎన్నిక జరుగుతుండటం వలన.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఓట్లతోనే మార్పు జరగాలని, ఓట్ల విప్లవం సృష్టిం చి రాజ్యంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు