సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు మెదడులో చిప్ చెడిపోయిందని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారి ప్రవర్తిస్తున్నారని రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ను ఓడించాక రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయిందని ప్రజలనుకుంటూ ఉంటే తాను తిరిగిరావాలని వారంతా కోరుకుంటున్నట్లు ప్రతిపక్ష నేత భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం చిత్తశుద్ధితో నవ రత్నాలు అమలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ప్రజల్ని ప్రాంతాల వారీగా అవమానిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.