వైఎస్ఆర్ హయాంలో పోలవరాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు
కాంట్రాక్ట్ల ప్రాజెక్టుగా మార్చిన ఘనత చంద్రబాబుదే
స్టేలతో నిజాలను భూస్థాపితం చేయడం బాబుకు అలవాటే
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. పోలవరం విషయంతో పాటు ఏపీకి చెందిన ప్రధాన అంశాల్లోనూ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పోలవరం అంశంపై చిట్చాట్లో బాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. స్పష్టమైన ప్రకటనలు చేయండానే ఏపీ సీఎం చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే పోలవరాన్ని చంద్రబాబు సర్కార్ కాంట్రాక్ట్ల ప్రాజెక్టుగా మార్చిందని గడికోట దుయ్యబట్టారు. ఇందులో చంద్రబాబే ప్రధాన కాంట్రాక్టర్ కాగా, రాయపాటి సాంబశివరావు, మరికొందరు టీడీపీ నేతలు ఇతర కాంట్రాక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. విచారణ చేపడితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని, స్టేలు తెచ్చుకుంటూ నిజాలను భూస్థాపితం చేయడం చంద్రబాబుకు అలవాటేనని గడికోట శ్రీకాంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
స్టేలతో నిజాలను భూస్థాపితం చేయడం బాబుకు అలవాటే