టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి గంటా, కేశినేని డుమ్మా

13 Aug, 2019 15:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు, ఎంపీ కేశీనేని నాని గైర్హాజరయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వకపోవడం పట్ల గంటా కోపంగా ఉండగా.. జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యహరశైలిపై ఎంపీ నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఈ ఇద్దరు అగ్ర నేతలు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు