గోరంట్ల బుచ్చయ్య వర్సెస్‌ సోము వీర్రాజు

26 Jun, 2019 19:00 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏం మాట్లాడుతున్నవాంటే ఏం మాట్లాడుతున్నావని వాదించుకున్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో మంజూరైన ఇళ్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పూర్తి చేయలేదని సోము వీర్రాజు అనగానే బుచ్చయ్య చౌదరి ఆవేశంతో ఊగిపోయారు.  మిగిలిన సభ్యులు, మంత్రులు వీరిని శాంతింపజేశారు.

మరిన్ని వార్తలు