రాష్ట్ర హోదా ఇస్తే బీజేపీకి ప్రచారం: కేజ్రీవాల్‌

12 Jun, 2018 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్రం ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తే ఆ ఎన్నికల్లో తాము బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం ఢిల్లీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకుంటారా లేక అది కేవలం ఓ అబద్ధపు, మోసపూరిత హామీగా మిగిలిపోనుందా అని ప్రశ్నించారు. దేశమంతటికీ 1947లో స్వాతంత్య్రం వచ్చినా ఢిల్లీకి మాత్రం రాలేదనీ, బ్రిటిష్‌ వారికన్నా ఘోరమైన రీతిలో కేంద్రం ఢిల్లీ ప్రజలను హింసిస్తోందంటూ కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు