సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ రైతు దినోత్సవంపై ట్విటర్లో టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను అనకాపల్లి ఎమ్యెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లోకేశ్కు లేదన్నారు.
‘మీ నాన్న ఓ రాజకీయ విష సర్పం. ఎన్నికల్లో ఆ సర్పం కోరలు ప్రజలే పీకేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేయలేని పనులను కేవలం నలభై రోజుల్లో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలే కారణం. విద్యుత్ బకాయిలు ఒక్కొక్కటి మా ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తోంది. వచ్చే ఏడాదికి కోతలు లేకుండా చేస్తాం. రైతులకు విత్తనాల సరఫరాలో విఫలమైందని ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మే నెల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, రైతులు ఇబ్బందులు పడతారన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేద’ని అమర్నాథ్ ప్రశ్నించారు. (చదవండి: లోకేశ్కి ట్వీట్ చేయడం కూడా రాదు)