వరంగల్‌ మేయర్‌గా ప్రకాశ్‌రావు

28 Apr, 2019 02:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఎన్నిక ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, కార్యకర్తగా ఆయన విధేయతకు పార్టీ అధిష్టానం పట్టం కట్టింది. వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా 2016 మార్చిలో జరిగిన ఎన్నికల్లో నన్నపునేని నరేందర్‌ ఎన్నికయ్యారు. అయితే, గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మేయర్‌ ఎన్నిక కోసం శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రిసై డింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధ్యక్షతన సమావేశం జరగగా 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌రావును ఎన్నుకున్నారు. అనంత రం ప్రకాశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు