రిజర్వేషన్ల కోసం హార్దిక్‌ ఆమరణ దీక్ష

26 Aug, 2018 04:01 IST|Sakshi
హార్దిక్‌ పటేల్‌

అహ్మదాబాద్‌: విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్‌) చీఫ్‌ హార్దిక్‌ పటేల్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దతుదారుల సమక్షంలో హార్దిక్‌ తన ఫాంహౌస్‌లో దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రాంగణానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలిరావటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నేతలు హార్దిక్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ దీక్ష వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. రెండు నెలల క్రితం దీక్షకు అనుమతి కోరామని..అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వలేదని హార్దిక్‌ ఆరోపించారు. 

మరిన్ని వార్తలు