హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు

21 May, 2019 19:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురైంది. వీవీప్యాట్ల ముందస్తు లెక్కింపుపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ రోజున మొదట ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని న్యాయవాది బాలాజీ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై  మూడు గంటలపాటు విచారించిన అనంతరం జస్టిస్‌ శ్యాంప్రసాద్‌ దీనిని తోసిపుచ్చారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు