‘కర్ణాటక గవర్నర్‌ నిర్ణయాన్ని నిలిపేయాలి’

21 May, 2018 20:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్‌ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్‌ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్‌ కుమార్‌ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు.

కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది  తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్‌ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్‌ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్‌ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్‌.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

మరిన్ని వార్తలు