పిల్లలతో కుస్తీ పోటీయా?

19 Oct, 2019 03:24 IST|Sakshi

బీడ్‌: మహారాష్ట్రలో తమతో తలపడే మల్లయోధుడే లేరన్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యలకు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ దీటుగా సమాధాన మిచ్చారు. పసికూనలతో ఎవరు తలపడతారంటూ ఎద్దేవా చేశారు. బీడ్‌ జిల్లా అంబేజొగయ్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ...ఇక్కడ మహారాష్ట్ర స్టేట్‌ రెజిలింగ్‌ అసోసియేషన్‌ అనే ఒకటుంది. దాని అధ్యక్షుడి పేరు శరద్‌ పవార్‌. రెజిలర్లందరికీ అండగా నేనుంటా. మేం పిల్లలతో పోటీకి దిగం’అని పేర్కొన్నారు. తమకు పోటీయే లేదని చెబుతున్న బీజేపీ నేతలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, యూపీ సీం ఆదిత్యనాథ్‌ వంటి వారితో రాష్ట్రంలో ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారని పవార్‌ ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు