ప్రజాసేవకే నా జీవితం అంకితం : కోమటిరెడ్డి

16 Dec, 2018 14:22 IST|Sakshi

సాక్షి, నల్గొండ : 20 ఏళ్లుగా ఎల్లపుడు ప్రజల్లో ఉండే నాయకుడిగా తన జీవితం ప్రజాసేవకే అంకితమని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని తాను ఎపుడో నిర్ణయించుకున్నట్లు, ఈ విషయం రాహుల్ గాంధీతో చెప్పగా సరేనన్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ సభ్యుడిగా జిల్లా నాయకుల అందరి సహాయంతో తప్పకుండా పోటీచేస్తానని తెలిపారు.

కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే సర్పంచ్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని ఎక్కువ సర్పంచ్‌లను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో సర్పంచ్‌లకు నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు