నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం: ఇంద్రసేనారెడ్డి

26 Nov, 2017 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ కోసం చిత్తశుద్ధితో పని చేయకుండా నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు, ఎన్ని ఖాళీలున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల ఖాళీల విషయంలో కోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతున్నదని ఆరోపించారు. యువకులకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేకుండా, ముందుచూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నోటిఫికేషన్లు ఇచ్చిందని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు