సీఎం కమల్‌నాథ్‌ ఓఎస్డీ నివాసంలో ఐటీ దాడులు

7 Apr, 2019 09:12 IST|Sakshi

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే  సీఎం అడ్వైజర్‌ రాజేంద్ర కుమార్‌ ఇంట్లో (ఢిల్లీ) కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.9కోట్లు నగదు లభించినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు అధికారులు ...తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు హవాలా రూపంలో నగదును తరలిస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో ఐటీ దాడులు జరిపినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


 

మరిన్ని వార్తలు