రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం

9 Jun, 2018 17:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఎంపీ మంద జగన్నాథంను ఢిల్లీలో రాష్ట్ర  ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మందా జగన్నాథం కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటీకే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా వేణుగోపాలచారి, తేజావత్‌, రామచంద్రులు ఉండగా తాజాగా మందాను నియామించడంతో ప్రభుత్వ ప్రతినిధు సంఖ్య నాలుగుకు పెరిగింది.

మరిన్ని వార్తలు