సాక్షి, హైదరాబాద్: అరెస్టు చేయడం ద్వారా ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తనకు మేలే చేశాడని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడా రు. తన ఇల్లు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారని, తనపై అవినీతి ఆరోపణలు విని వారే నవ్వుకు న్నారని చెప్పారు.
తనను అరెస్టు చేయడం ద్వారా కేసీఆర్ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నార ని ప్రజలకు అర్థమైందని, తాను మానసికంగా ఇబ్బంది పడ్డా రాజకీయంగా మంచే జరిగింద న్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు పల్లెపల్లెన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించి కాంగ్రెస్ చేసిన మేలు.. కేసీఆర్ మోసాల గురించి ప్రజలకు వివరిస్తామని జగ్గారెడ్డి చెప్పారు.