జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు

26 Oct, 2019 20:47 IST|Sakshi

సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో జేసీ వర్గీయుల అవినీతి బయటపడిండి. మున్సిపల్ కాంప్లెక్స్‌ లీజులో జేసీ వర్గీయులు రూ.75 లక్షల స్వాహా చేసినట్టు తెలిసింది. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్ ద్వారా వారు అక్రమాలు చేయించినట్టు  వెల్లడైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీక్షా సమావేశంలో జేసీ వర్గీయుల దందా వెలుగు చూసింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అద్దె, డిపాజిట్ సొమ్ము నేరుగా మున్సిపాలిటీకే చెల్లించాలని సూచించారు.

మరిన్ని వార్తలు