అందులో పరోక్షంగా చంద్రబాబు పాత్ర ఉంది: జేసీ

14 Sep, 2019 11:16 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల కారణంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శనివారం కడపలో జేసీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైందన్నారు. ఆ ప్రభంజనం ఎక్కువైనా లేదా తక్కువైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరోక్ష పాత్ర ఎంతైనా ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు