కేటీఆర్ సవాల్పై జీవన్రెడ్డి వ్యాఖ్య
ధర్మారం (ధర్మపురి): మంత్రి కేటీఆర్కు సన్యాసం తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాం గ్రెస్నేత టి.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్పై ఆయన పైవిధంగా స్పందించారు. కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ నియంతృత్వ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు బలయ్యారని అన్నారు.