ప్రజల మనోభావాలను దెబ్బతీశారు..

9 Feb, 2018 02:13 IST|Sakshi

ప్రధాని వ్యాఖ్యలపై సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి

జగిత్యాల: దేశాన్ని విడగొట్టినట్టే, ఏపీని విడగొట్టారని ప్రధాని స్థాయిలో ఉండి నరేంద్రమోదీ  మాట్లాడటం సమంజసం కాదని, ఆయన తెలం గాణ ప్రజల మనోభావాలను కించపరిచారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ఏకపక్షంగా చేశారని, పార్లమెంట్‌ తలుపులు మూసి విభజించారని అనడం సమంజసం కాదన్నారు.

అన్ని పార్టీల ఆమోదంతోనే తెలంగాణ ఇచ్చారని, ఇక్కడి ప్రజలు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా భావించారని, సుష్మాస్వరాజ్‌ను సైతం చిన్నమ్మగా పేర్కొన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్డీఏకు తొత్తుగా మారారని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీని సైతం సమర్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బయట పులి, లోపల పిల్లిలాగా వ్యవహరిస్తూ మోదీని చూసి వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు