మోదీకి కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు : కాంగ్రెస్‌

26 Aug, 2018 13:44 IST|Sakshi
జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కంటే తెలంగాణ సీఎం కేసీఆరే అత్యంత సన్నిహితుడని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కొత్త జిల్లాలను ఆమోదింప చేసుకోవడానికి జోనల్‌ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయం ఏర్పాటు మంచి నిర్ణయం కాదన్నారు. కేసీఆర్‌ చేపట్టిన ఏ కార్యక్రమం ప్రగతి సాధించలేదు..నాలుగేళ్లలో సాధించిన ప్రగతి ప్రగతి భవన్‌ మాత్రమేనని అన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ అంశం ఎటుపోయిందని ప్రశ్నించారు. ఫలితాలు సాధించనపుడు ఓటు అడిగే అర్హత ఉండదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు 6 నెలల వ్యవధి ఉండగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు