విశ్వాసం పెడితే అడ్డుపడుతున్నారు

17 Mar, 2018 03:06 IST|Sakshi

టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడితే టీఆర్‌ఎస్‌ ఎంపీలు సభ ఆర్డర్‌లో లేకుండా ఆందోళన చేస్తూ బీజేపీ కనుసైగల్లో పనిచేస్తున్నారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు.

మూడో ప్రత్యామ్నాయం పేరు వల్లిస్తున్న సీఎం కేసీఆర్‌.. బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేలా టీఆర్‌ఎస్‌ ఎంపీలను నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు టీఎంసీ, టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు అవిశ్వాసం పెడితే పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోందన్నారు. 

మరిన్ని వార్తలు