తమిళనాడులో ఆసక్తికర పరిణామం

18 Feb, 2018 15:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ సినీనటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ ఆదివారం చర్చలు జరిపారు. రజనీ నివాసానికి వచ్చిన కమల్‌ చాలాసేపు ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు కమల్‌హాసన్‌ ప్రకటించిన నేపథ్యంలో వీరద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

సమావేశం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ మాట్లాడుతూ... కమల్‌పై ప్రశంసలు కురిపించారు. డబ్బు, పేరు కోసం ఏనాడు కమల్‌ పాకులాడలేదని.. తమిళ ప్రజల శ్రయేస్సు కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు.

కొత్త పార్టీ పెట్టనున్న కమల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు కమల్‌హాసన్‌ చెప్పారు. రాష్ట్రంలో తన పర్యటన గురించి రజనీకి వివరించినట్టు వెల్లడించారు. రజనీకాంత్‌ పెట్టబోయే పార్టీతో పొత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు