స్పష్టం చేసిన కాపునాడు నేతలు

22 Jan, 2019 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఇచ్చే వాటా తమకు అవసరం లేదంటున్నారు రాష్ట్ర కాపునాడు సంఘం నేతలు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపు వ్యతిరేకి.. మాయ మాటలు చెప్తాడు నమ్మవద్దంటూ హెచ్చరించారు. చంద్రబాబు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలోనే కాపులకు వాటా ఇస్తానని అంటున్నాడు. ఇలా చేయడం అంటే కాపులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టడమే అని తెలిపారు. ఈబీసీ కోటాలో ఇచ్చే రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని పేర్కొన్నారు.

2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోసారి ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను మోసం చేయడాని​కి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రచారం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఓ చేత్తో రిజర్వేషన్లు ఇచ్చి మరో చేత్తో కోర్టులో కేసులు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు