ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో 

3 Nov, 2018 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పారితోషికం పెంచాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ నేతృత్వంలోని బృందం కలసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.  

మరిన్ని వార్తలు