‘ఢిల్లీ వేదికగా చంద్రబాబు డ్రామా’

28 Oct, 2018 12:51 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వేదికగా డ్రామాలు ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని అందరం ఖండించామని, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశామని తెలిపారు. చంద్రబాబును మానసిక వైద్యుడి దగ్గర ట్రీట్‌మెంట్‌ చేయించాల్సిన అవసరముందన్నారు. మహాకూటమి అంటూ అందర్నీ కలుస్తున్నాడని, దీని వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీయే అని పేర్కొన్నారు. అవినీతికి కేరాఫ్‌గా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. మోడీ, జగన్‌ను తిట్టడమే చంద్రబాబు ధ్యేయంగా మార్చుకున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు గవర్నర్‌ను పొగిడిన బాబుకు ఇప్పుడు విరోధి అయ్యారా అని ప్రశ్నించారు. సిగ్గు శరం ఉంటే హోం మంత్రి చినరాజప్ప రాజీనామా చేయాలని ఘాటుగా స్పందించారు.  

మరిన్ని వార్తలు