29న వైఎస్సార్‌సీపీలోకి కాటసాని

26 Apr, 2018 02:36 IST|Sakshi

కర్నూలు (టౌన్‌) : కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ నెల 29వ తేదీన తన మద్దతుదారులతో బయలుదేరి వెళ్లి.. గుడివాడ – పామర్రు మధ్య ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన బుధవారం సాయంత్రం కర్నూలు నగరం కల్లూరులోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు