బీసీలను మోసగిస్తున్న కేసీఆర్‌: వీహెచ్‌

30 Sep, 2017 03:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీసీలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నా రని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బర్లు, గొర్లు, బతుకమ్మ చీరలు అంటూ బీసీల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని, బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని వీహెచ్‌ కోరారు. 

మరిన్ని వార్తలు