మంత్రి కొడాలి నాని
గుడ్లవల్లేరు(గుడివాడ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. మండలంలోని చంద్రాలలో పార్టీ నాయకులు నిమ్మగడ్డ కుటుంబరావు నివాసంలో టీడీపీకి చెందిన 20మంది సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. కొడాలి నాని వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి నాని మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం లాగా మోసపూరిత ప్రభుత్వం కాదని అర్థం చేసుకున్న యువత అంతా తమ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు దుగ్గిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, కోగంటి ధనుంజయ, దుగ్గిరాల శేషుబాబు, డోకాల కనకరత్నారావు, తాళ్లూరి మాధవ్, శాయన రవి, కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ పడమటి సుజాత పాల్గొన్నారు.