కేటీఆర్‌వి బచ్చాగాని మాటలు

2 Nov, 2018 01:29 IST|Sakshi

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ: ‘కేటీఆర్‌వి బచ్చాగాని మాటలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఆయన సెల్‌ఫోన్‌ డిసెంబర్‌ 12న స్విచ్చాఫ్‌ అవుతుంది’ అని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టు కుంటే రిమోట్‌ రాహుల్‌ గాంధీ దగ్గర, సెల్‌ చంద్రబాబు వద్ద ఉంటుందని కేటీఆర్‌ అన్న మాటలపై మీడి యా ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఢిల్లీ వెళ్లాలని కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, ఆయ నవి పరిపక్వత లేని మాట లని అభివర్ణించారు. కాంగ్రెస్‌ గెలిస్తే వంద మంది సీఎం అభ్యర్థులున్నారంటూ అంటున్నారని, తమలో ఎవరో ఒకరు సీఎం అవుతారని, ఈ విషయం ఆయనకెందుకని ప్రశ్నించారు. ప్రచారంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని, అలాకాకుండా నిత్యం కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు