కేసీఆర్, మోదీ తోడు దొంగలు: కోమటిరెడ్డి

12 Nov, 2018 03:28 IST|Sakshi

నల్లగొండ: ‘కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలు.. వారి పాలనలో పేదల సం క్షేమ పథకాలు సరిగ్గా అమ లు కావడంలేదు’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలను విస్మరించాయని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను గమనిం చి ఎన్నికల్లో కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీ పథకాన్ని అమలు చేసి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు