హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి

3 Oct, 2019 03:34 IST|Sakshi

బొమ్మలరామారం: రాష్ట్రంలో డెంగీ జ్వరం వస్తే లక్షలు ఖర్చు చేసుకుంటున్న పేదలను ఆదుకోకుండా వాస్తు దోషం పేరిట రూ.4 వేల కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ కేవలం కమీషన్‌ల కోసమే సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారన్నారు.  

మరిన్ని వార్తలు