ఇది ప్రజా విజయం: కోటంరెడ్డి

9 Mar, 2018 19:28 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ప్రజల ఒత్తిడి, ప్రతిపక్ష పోరాట పటిమ వల్లే ఆలస్యంగానైనా టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కేవలం రాజీనామాలతో సరిపెట్టకుండా, అవిశ్వాసం పెట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ అంశంలో వైఎస్‌ఆర్‌ సీపీ కూడా మద్దతిస్తుందని తెలిపారు. ‘ప్రతీ గొంతుకలో ప్రత్యేక హోదా ఆకాంక్షను వినిపిద్దాం.. హోదా కోసం కలిసి అడుగులు వేద్దామ’ని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు