మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్‌

5 Sep, 2018 14:25 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి(పాత చిత్రం)

ఎమ్మిగనూరు: దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని..అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని  కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు పాలకులు అవుతారే తప్ప భక్షించే వాళ్లు కాదన్నారు.

దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్‌ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు