పచ్చ మీడియాతో కలిసి కొత్త డ్రామాలు

12 Apr, 2019 21:01 IST|Sakshi

ట్విటర్‌లో కేటీఆర్‌ కామెంట్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఓడిపోతామని చంద్రబాబు నాయుడికి అర్థమయ్యింది.. అందుకే పచ్చ మీడియాతో కలిసి కొత్త డ్రామాలకు తెర తీశారంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఫలితాలు వచ్చాక తెల్ల మొహం వేయకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయాత్నాలు ప్రారంభించారన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు, పచ్చ మీడియా జనాల ముందు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ నాటకాన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవేవి టీడీపీనీ కాపాడలేవంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు