కేసీఆర్‌కు సింగరేణి ఎన్నికల భయం

4 Oct, 2017 02:48 IST|Sakshi

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా

సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఎన్నికల భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ.కుంతియా అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయబోరని సింగరేణి కార్మికులు భావిస్తున్నారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు కార్మికులు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. బలమైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు కలవడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.  

మరిన్ని వార్తలు