టీడీపీక నేతలకు కన్నబాబు ప్రశ్న

5 Feb, 2019 19:43 IST|Sakshi

కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా): ఏపీ సీఎం చంద్రబాబు తన చివరి బడ్జెట్ ప్రవేశ పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెప్పిన హామీలు అమలు చేయకుండా పరిపాలన చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసాల చిట్టా, అబద్దాల పుట్టలా ఉందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో అంకెలా గారడీ చేశారని ఆరోపించారు. నిమ్నవర్గాల సంక్షేమానికి అరకొర కేటాయింపులు జరిపారని.. బీసీ సబ్ ప్లాన్ ఏమిటో, బీసీ సంక్షేమానికి రూ.3వేల కోట్లు కేటాయించడం ఏమిటో అర్ధం కావడం లేదని కన్నబాబు వాపోయారు.

అమరావతికి వెళ్తే అక్కడ పశువులు మేస్తున్నాయని.. టీడీపీ నాయకులు మాత్రం అంతర్జాతీయ స్దాయిలో రాజధాని కట్టామని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అనడానికి మీకు సిగ్గు లేదా అని ప్రశ్నించింది. రైతుల ఉసురు మీకు తగులుతుందని కన్నబాబు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు