‘చంద్రబాబు ఎన్టీఆర్‌ అల్లుడంటే సిగ్గేస్తోంది’

29 Oct, 2018 14:18 IST|Sakshi

కోడి కత్తితో మీ నాన్నని ఒకసారి పొడిచి చూడు లోకేష్

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు నాయుడు దివంగత నేత ఎన్టీఆర్‌ అల్లుడని చెప్పడానికి సిగ్గేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఫైర్‌ అయ్యారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని, టీడీపీ సిద్దాంతాలు గాలికొదిలేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దగుల్భాజీ రాజకీయాలు చేస్తూ.. పార్టీని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. (చదవండి: ‘ఆశ్చరం కాదు లోకేశా.. ఆశ్చర్యం అనాలి’ )

‘నీ 40 ఏళ్ల అనుభవంతో నీ కొడుకు వయసున్న జగన్‌పై హత్యాయత్నం చేయిస్తావా? రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగుతోంది.  ఆపరేషన్ గరుడను సృష్టించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావ్. ప్రతిపక్ష నేతను అంతం చేయడమే లక్ష్యంగా..నీ ప్లాన్ అని అందరికి తెలిసింది. చంద్రబాబు నువ్వు హడావిడిగా ఢిల్లీ ఎందుకు పరిగెత్తావ్? పనికిమాలిన నీ కొడుకును ప్రజలపై రుద్దడం కోసం ఇంత దారుణం చేస్తావా? నిన్ను అల్లుడు అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నీ గురుంచి మాట్లాడాలంటేనే సిగ్గేస్తుంది. డీజీపీ నువ్వు ఆ పదవికి అర్హుడివా? చంద్రబాబు బుర్ర పనిచేయడం లేదు, అతను ఎందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. నిసిగ్గుగా అబద్దాలు చెప్తున్న చంద్రబాబు ఇప్పటికైనా నువ్వు హత్యా రాజకీయాలు ఆపు. చంద్రబాబు జీవితంలో ఇదే చివరి అంకం. అలిపిరిలో నీ మీద దాడి జరిగితే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాడు నిన్ను పరామర్శించారు. నీకు, నీ కుటుంబానికి ఆయన అండగా నిలబడితే ఇప్పుడు నీ మిత్రుడి కొడుకుపై ఇంత దారుణానికి సిద్ధపడతావా? చంద్రబాబు నువ్వు అడవిలో జంతువులా బతుకు, సమాజంలో బతికే అర్హత కోల్పోయావ్ . కోడి కత్తితో మీ నాన్నని ఒకసారి పొడిచి చూడు లోకేష్, అప్పుడు తెలుస్తుంది బాదేంటో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: జగన్‌పై హత్యాయత్నం: దారితప్పిన దర్యాప్తు)

మరిన్ని వార్తలు