లక్ష్మీస్ ఎన్టీఆరే అసలైన బయోపిక్‌: లక్ష్మీ పార్వతి

21 Oct, 2018 15:30 IST|Sakshi

విజయనగరం: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమానే అసలైన బయోపిక్‌ అంటున్నారు ఎన్టీఆర్‌ సతీమణి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి.  ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఎలా లాక్కున్నారో ఈ సినిమా ద్వారా తెలుస్తోందని ఆమె అన్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో వాస్తవాలు బయటకురావడం ఖాయమన్నారు. టీడీపీ నేతలకు ఎన్టీఆర్‌ మాటలు వినాలంటే భయంపట్టుకుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎలాంటి భయం లేకుండా ఎన్టీఆర్‌ ఎలా మరణించారో ప్రజలకు చూపిస్తారని నమ్ముతున్నట్లు  ఆమె తెలిపారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా ప‍్రజలు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజయ్‌ కృష్ణ రంగారావు పార్టీ మారినా తమకేమీ చేయలేదని మహిళలే చీదరించుకుంటున్నారన్నారు.

మరిన్ని వార్తలు