ఇక తెలంగాణే బీజేపీ టార్గెట్‌ : లక్ష్మణ్‌

11 Dec, 2017 02:58 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: బీజేపీ టార్గెట్‌ ఇక తెలంగాణ రాష్ట్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన జిల్లా శక్తి కేంద్రాల కన్వీనర్ల సమావేశానికి హాజరయ్యారు. విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జనవరి నుంచి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌ ఎన్నికల అనంతరం బీజేపీ గురి తెలంగాణపైనే ఉందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ.1.50 లక్షల కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ, 22 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జనవరిలో సభలు నిర్వహిస్తామని, ఈ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 23వేల బూత్‌ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. శక్తి కేంద్రాలు, ఫుల్‌టైమ్‌ వర్కర్లను నియమించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలపై పోరుబాట చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు