వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న ఎల్‌కే అద్వానీ

14 Aug, 2019 20:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ (91) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ప్రతి ఏడాది ఆయన ఆగస్టు 15న తన నివాసంలో జెండా వందనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీకి వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఈసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. గత అయిదు రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు