జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం..

2 Aug, 2019 13:12 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్‌ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆయన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో తమకు జరిగిన అన్యాయంపై స్థానికులు ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని స్థానికులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డిని అడ్డుకున్న స్థానికులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు