ఏపీ శాసన మండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్‌

7 Feb, 2019 12:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో షరీఫ్‌ తరఫున ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ప్రకటన వెలువడగానే ఆయన గురువారం మండలి చైర్మన్‌ పదవిని చేపట్టారు. మొన్నటివరకు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను ఇటీవల చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకోవడంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది.

మరిన్ని వార్తలు