శంకర్‌ బండారం బయటపెడతా

20 Mar, 2019 13:20 IST|Sakshi
మల్లికార్జున నాయుడు

తంబళ్లపల్లెలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా

టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జుననాయుడు

బి.కొత్తకోట: ఎమ్మెల్యే శంకర్‌ తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగించిన అవినీతి, అక్రమాలను బయటపెడతానని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కే.మల్లికార్జుననాయుడు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తంబళ్లపల్లెలో పార్టీ కోసం కష్టించి పనిచేసిన తనకు తీరని అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో తనకు అపాయింట్‌మెంట్‌ దొరక్కుండా టీడీపీకి చెందిన కొందరు జిల్లా నాయకులు, ఎమ్మెల్యే శంకర్‌ 22 సార్లు అడ్డుపడ్డారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన తనను తంబళ్లపల్లె పరిశీలకునిగా నియమించగా ప్రస్తుతం పరిశీలకుడిగా ఎక్కడా నియమించకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో శంకర్‌ అవినీతి వ్యవహారాన్ని అందరికి తెలిసేలా త్వరలో బి.కొత్తకోటలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అలాగే తంబళ్లపల్లెలో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు.

మరిన్ని వార్తలు