పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

30 Jul, 2019 12:51 IST|Sakshi

 అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు

అమరావతి: పార్లమెంట్‌ నియోజకర్గానికి ఒక స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు తెలిపారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చేవరకు టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు.

 
 

మరిన్ని వార్తలు