‘దుక్కలా ఉండి పెన్షన్‌ అడుగుతారా’

4 Jan, 2019 10:34 IST|Sakshi

మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై మహిళలు సీరియస్‌

సాక్షి, విశాఖ : ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడారు. విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వితుంతు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భర్త చనిపోయినవారికి పెన్షన్‌ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్‌ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్‌ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్‌ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు (వితంతువులు) రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడుతారా అని తిట్టిపోస్తున్నారు.

మరిన్ని వార్తలు