ప్రగతి భవన్లో సమావేశం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో కేబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్లో వీరి సమావేశం జరిగింది. చాలాకాలం తర్వాత మంత్రి ఈటల సీఎం కేసీఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఒక్కరిద్దరికి ఉద్వాసన ఉండొచ్చునని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి ఈటలను కూడా కేబినెట్ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల సీఎం కేసీఆర్ను కలువడం ప్రాధాన్యం సంతరించుకొంది. అయితే, రాష్ట్రంలో వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకే ఆయన కేసీఆర్ను కలిశారని, కేసీఆర్ పిలుపుమేరకే ఈ భేటీ జరిగిందని ఈటల సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ పార్టీలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగగా.. అది చిల్లర ప్రచారమని కొట్టిపారేసిన ఈటల.. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమేనంటూ హాట్ కామెంట్స్ చేశారు.